తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది.  ఇక వరుస విజయాలు అందుకుంటున్న రామ్ చరణ్ ప్రస్తుతం మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈచిత్రం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రం పూర్తైన తర్వాత ఎన్టీఆర్ అప్పుడే డైరెక్టర్ల ను లైన్లో పెట్టుకున్నారు.  అయితే రామ్ చరణ్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

ఓ వైపు హీరోగా నటిస్తూనే నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్న రామ్ చరణ్ రెండింటిలోనూ బిజీగా ఉంటున్నారు.  తాజాగా ఆర్ఆర్ఆర్  చిత్రం తర్వాత ఆయన ఏ డైరెక్టర్ తో వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.  మహేష్ బాబు.. పరుశరామ్, వంశి పైడి పల్లి లైన్లో పెట్టారు.  ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని లైన్లో పెట్టారు.  అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ ని లైన్లో పెట్టారు. స్టార్ డైరెక్టర్స్ మొత్తం ఎవరి బిజీలో ఉన్నారు.  ఇక చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల చిత్రంలో నటిస్తున్నారు. 

 

యువతరం స్టార్ హీరోలు చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. తప్పకుండా హిట్ ఇస్తారు అనే దర్శకులను ముందుగానే లైన్లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు.  ఇక కొరటాల తరువాత చరణ్ .. త్రివిక్రమ్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మాట ముచ్చట్లు కూడా అయినట్లు సమాచారం.  హిట్ దర్శకులను ముందే లైన్లో పెట్టుకుంటే వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించవొచ్చు అని చెర్రీ మంచి ప్లాన్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: