అర్జెంటుగా సక్సెస్ ఇవ్వకపోతే జనాలు వీళ్లని మర్చిపోయేలా ఉన్నారు ఎందుకంటే ..అప్పుడెప్పుడో హిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లాపులతో పలకరించారు. ఇంకేముంది ఇండస్ట్రీ గురించి తెలిసిందేగా..హిట్ ఇచ్చినప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నవాళ్లు.. ఫ్లాప్ ఇచ్చినప్పుడు కనీసం కాంపౌండ్ దగ్గరకు కూడా రానివ్వరు. అలా ఈ మద్య కనిపించకుండా పోయిన  తర్వాత శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ , పరశురామ్ లాంటి డైరెక్టర్లు మళ్లీ మాకు సినిమాలు దొరకుతున్నాయోచ్  అని ఎగిరిగంతేస్తున్నారు. 

 

సక్సెస్ ఇస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పట్టించుకునేది. ఒక్క ఫ్లాప్ వచ్చినా పక్కనపెట్టేస్తారు. అలా ఒకప్పుడు హిట్లు ఇచ్చి తర్వాత ఫ్లాపులతో ఇబ్బంది పడి..సినిమాలు లేక ఖాళీగా ఉండి అవకాశాల కోసంవెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు మళ్లీ హమ్మయ్య సినిమాలొస్తున్నాయి అని ఆనందపడిపోతున్నారు.  శ్రీకాంత్ అడ్డాల .. వెంకటేష్, మహేష్ లాంటి స్టార్లతో మంచి హిట్ సినిమా చేసి కూడా 2016 లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అవ్వడంతో అసలు అడ్రస్ లేకుండా పోయాడు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత వెంకటేష్ తో అసురన్ తమిళ్ రీమేక్ గా వస్తున్న నారప్ప సినిమా చేస్తున్నాడు. అంతేకాదు.. వరుణ్ తేజ్ తో మరో సినిమా కూడా రెడీగా ఉంది. 

 

మిగతా డైరెక్టర్లలాగా ఫ్లాప్ ఇచ్చి ఇబ్బంది పడలేదు పరశురామ్ .గీతగోవిందం లాంటి 100 కోట్ల సినిమా చేసి కూడా ఛాన్స్ లేక ఖాళీగా ఉన్నాడు. 2018 లో వచ్చిన గీతగోవిందం తర్వాత రెండేళ్లకు నాగచైతన్య ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ లో కూడా మరో సినిమా చెయ్యబోతున్నానని తెగ ఆనందపడిపోతున్నాడు పరశురామ్. బొమ్మరిల్లు సినిమానే తన ఇంటి పేరుగా చేసుకున్న భాస్కర్..కెరీర్ లో ఈ సినిమాతో బంపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా పేరు తెచ్చుకోలేదు. 2013 లో వచ్చిన ఒంగోలు గిత్త తర్వాత అసలు తెలుగులో అడ్రస్ లేకుండాపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ మీదే నెక్ట్స్ దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా డిపెండ్ అయ్యి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: