ఈ నగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ లతో డిజాస్టర్లను చవిచూసిన యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎట్టకేలకు హిట్ తో కెరీర్ లో మొదటి హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన ఈచిత్రం డీసెంట్ టాక్ తో డీసెంట్ వసూళ్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ ను చేరుకుంది. నాలుగో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 44లక్షల షేర్ ను రాబట్టి నాలుగురోజుల్లో 4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల వరకు షేర్ ను రాబట్టిందని సమాచారం. ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదల లేనందున ఫుల్ రన్ లో ఈ చిత్రం మరో రెండు కోట్ల వసూళ్లను రాబట్టేలానే  కనిపిస్తుంది. 
 
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యం లో నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు  వివేక్ సాగర్ సంగీతం అందించాడు. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకం పై నేచురల్ స్టార్ నాని , ప్రశాంతి సంయుక్తంగా ఈ హిట్ ను నిర్మించారు. కాగా వీరి నిర్మాణంలో ఇది రెండో సినిమా.. ఇంతకుముందు నాని -ప్రశాంతి కలిసి అవె అనే సినిమాను నిర్మించారు. 
 
హిట్ నాలుగో రోజు వసూళ్ల వివరాలు : 
నైజాం - 23 లక్షలు 
సీడెడ్ - 4 లక్షలు 
ఉత్తరాంద్ర - 6 లక్షలు 
గుంటూరు - 2.2లక్షలు 
తూర్పు గోదావరి - 2 లక్షలు  
పశ్చిమ గోదావరి - 2 లక్షలు 
కృష్ణా - 3 లక్షలు  
నెల్లూరు - 1.4 లక్షలు  
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం నాలుగో రోజు షేర్ = 0.44 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: