మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో హిట్స్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ కు మారుపేరుగా నిలిచారు. ఇలా ఎన్నో సినిమాల్లో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవికి ఓ కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. అదేమంటే, బాలీవుడ్ లో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో చేయాలనే తపన. కానీ, ఇప్పటి వరకు ఆ కోరిక నెరవేరలేదు. గతంలో అవకాశాలు వచ్చిన కొన్ని కారణాల వలన మిస్ అయ్యాయి.
అయితే, ఇద్దరు కలిసి సైరా నరసింహారెడ్డిలో నటించారు. ఇది ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. ఇక్కడ విషయం ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి చేయలేకపోయిన పనిని తన కొడుకు రామ్ చరణ్ చేశాడు. అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ జంజీర్ ను రామ్ చరణ్ హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగులో ఎన్టీఆర్ అప్పట్లో నిప్పులాంటి మనిషిగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే బాటలో పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ పోషిస్తున్నాడు. దీనికి మెగాస్టార్ ఫిదా అయ్యాడట. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేయాలి అని కోరుకున్న వ్యక్తుల్లో చిరంజీవి కూడా ఒకరు. ఇదే విషయాన్నీ గతంలో పలుమార్లు మెగాస్టార్ పేర్కొన్నారు.
అయితే, అది చాలా తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆ అదృష్టం వచ్చింది. రీ ఎంట్రీ సినిమా అమితాబ్ రీమేక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మే నెల వరకు ఆగాల్సిందే. రీ ఏంటి సినిమా కాబట్టి తప్పకుండా సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. దిల్ రాజు నిర్మాత కాబట్టి అంత ఈజీగా సినిమాను వదిలెయ్యడు. చూద్దాం.