అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారు అని భావించారు చాలా మంది. ఆ సమయంలో ఆయన చాలా మంది నిర్మాతల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు అనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. రాజకీయంగా అప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక స్పష్టత లేకపోవడంతో చాలా వరకు పెద్ద నిర్మాణ సంస్థలు ఆయనకు కోట్లకు కోట్లు అడ్వాన్స్ లు ఇచ్చి సినిమాలు చేయడానికి సిద్దమయ్యారు. కాని పవన్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పార్టీ మీద దృష్టి పెట్టి సినిమాలు వదిలేసారు.

 

ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టారు. అయన మాట తప్పారో మాట మీద నిలబడ్డారో తన వారి కోసం ఆయన సినిమాలు చెయ్యాలి అనుకున్నారో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు గాని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన కోసం మరికొంత మంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. 

 

వాళ్ళు ఎవరూ అంటే, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత అడ్వాన్సు లు ఇచ్చిన వాళ్ళు. పవన్ మీద సినిమాలు చెయ్యాలని వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కి ఎంత పలుకుబడి ఉన్నా సరే నిర్మాతలు మాత్రం ఆయన్ను వడ్డీ తో సహా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలు చేయకపోతే కేసు కూడా పెట్టే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మరి ఆయన మీద ఏ కేసులు పెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: