ఈ మద్య కొత్త దర్శకులు, నటులు తమ టాటెంట్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదిస్తున్నారు. షార్ట్ ఫిలింస్తో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చారు తరుణ్ భాస్కర్. ఆయన తెరకెక్కించిన 'పెళ్లి చూపులు' సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమా సూపర్ హిట్ అందుకుంది. పెళ్లి చూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది తో మరో విజయం అందుకున్నాడు. దర్శకుడిగానే కాదు తరుణ్ భాస్కర్ హీరోగా కూడా తన సత్తా చాటాడు. 'కింగ్ అఫ్ ది హిల్' బ్యానర్పై సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ మూవీ నిర్మించారు.
'పెళ్లి చూపులు' సినిమాతో జాతీయ అవార్డు అందుకుని సంచలనం సృష్టించిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు దర్శకుడిగా మరో స్టార్ హీరోని లైన్లో పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం వెంకటేశ్ తన 74వ మూవీ'నారప్ప' చేస్తున్నారు. ఈ మూవీ తమిళ్ లో ధనుష్ నటించాడు.. అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ధనుష్ నటించిన 'అసురన్'కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేశ్ లుక్ .. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి. ఈ సినిమా తరువాత వెంకటేశ్ తన 75వ ఎవరితో అన్న చర్చలు ఇటీవల జరిగాయి.
అయితే తెరపైకి తరుణ్ భాస్కర్ పేరు రావడం విశేషం. ఇప్పటికే వెంకటేశ్ కథ ఓకే చెప్పేశారని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో తరుణ్ భాస్కర్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను కూడా సురేశ్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, 'నారప్ప' సినిమా షూటింగ్ పూర్తికాగానే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. త్వరలో ఈ మూవీకి సంబంధిచిన పూర్తి వివరాలు తెలుపబోతున్నారట.