భాగమతి తరువాత దాదాపు రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకొన్న సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క వచ్చే నెల 2న తన కొత్త చిత్రం నిశ్శబ్దం తో ప్రేక్షకులముందుకు రానుంది. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల వలన విడుదలను ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 6న మధ్యాహ్నం12:12 గంటలకు నేచురల్ స్టార్ నాని  విడుదలచేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ట్రైలర్ సినిమాకు ఎలాంటి హైప్ తీసుకొస్తుందో చూడాలి.
 
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్  ,సుబ్బరాజు, అంజలి షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఒకేసారి తెలుగు తోపాటు తమిళ ,మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. అయితే ఈమూడు భాషల్లో సైలెన్స్ అనే టైటిల్ తో విడుదలకానుంది.
 
ఇక తెలుగు లో ఈసినిమాకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఏప్రిల్ 2న నిశ్శబ్దం తోపాటు రానా నటిస్తున్న అరణ్య అలాగే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన కూడా అదే రోజున విడుదలకానున్నాయి. ఇక నిశ్శబ్దం తరువాత అనుష్క ఇంతవరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. మరి ఈ సినిమాతో అనుష్క మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: