టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ముందు వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. ఆ తర్వాత కన్నడ బ్యూటి రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది. ఇక పూజా హవా టాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉంది. తాజాగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కూడా ఒక సినిమాలో అవకాశం దక్కించుకొని మంచి ఫాం లో ఉంది. ఇక ఈమధ్య 'అల వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ సక్సస్ తో పూజా డిమాండ్ నాలుగింతలు పెరిగింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పూజ ఫోటో షూట్స్ మాత్రం రెగ్యులర్ గా చేస్తోంది. ఎవరైనా మ్యాగజైన్ వాళ్ళు గనక పూజా దగ్గరకు వస్తే చాలు బికిని గాని టూపీస్ బికిని గానీ ఏదైనా రెడీ అయిపోతుంది.

 

తాజాగా 'ది మ్యాగజైన్' అనే పత్రిక కోసం ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది.  ఈ ఫోటోలకు "మైను సూట్ సూట్ కర్దా" అంటూ పంజాబీ భాషలో క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో కి నెటిజన్స్ నుండి రక రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు కారణమని అంటున్నారు. 

 

ఎందుకంటే సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం అండర్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ గురించి న్యూస్ బయటకి రాగానే ఒకవైపు మెగాస్టార్ అభిమానులు, ఇటు సూపర్ స్టార్ అభిమానులు ఆనందం లో మునిగి తేలుతున్నారు. ఒకే ఫ్రేం లో ఇంతకముందు వెంకటేష్ ని మహేష్ బాబు ని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని మహేష్ బాబుని చూడబోతున్నారు.

 

ఇదే ఒక హాట్ న్యూస్ గా కొన్ని రోజుల నుండి ప్రేక్షకులను ఊపేస్తుంటే ఇప్పుడు మరో హాట్ న్యూస్ తో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించనుంది. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు మరో వైపు కమర్షియల్ ఫోటో షూట్స్ తో బాగా క్రేజ్ లో ఉంది కాబట్టి తన తోటి హీరోయిన్స్ ని లెక్క చేయడం లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: