ముందుగా కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ టి. రాజేంద్రన్ తనయుడు శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార. ఆ తర్వాత అతడికి దూరమై ప్రముఖ నృత్య దర్శకుడు డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న టైంలో సడన్ గా ఏం జరిగిందో ఏమోగానీ వీరిద్దరూ దూరమయ్యారు. కాస్త గ్యాప్ తీసుకుని హీరోయిన్ గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న నయనతార ఇప్పుడు యంగ్ డైరెక్టర్ విగ్నేష్ ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడింది. అయితే మధ్యలో మరో కోలీవుడ్ హీరో ఆర్యతో సైతం ఆమె ఎఫైర్  నడిపినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇవన్నీ ఇలా ఉంటే నయనతార జీవితం లో సింభుతో ఆమె నడిపిన లవ్ స్టోరీ చాలా హైలెట్‌గా నిలిచింది. వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్న టైంలో వల్లభ సినిమా వచ్చింది.

 

శింబు స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఏకంగా రెండు సంవత్సరాల పాటు నడిచింది. కేవలం నయనతారతో ప్రేమాయణం కోసమే సింభు ఈ సినిమాను రెండు సంవత్సరాల పాటు షూటింగ్ చేశాడన్న వాద‌న‌లు కూడా విన‌పించాయి.  ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మధ అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమాలో శింబు, నయనతార మధ్య చాలా గాఢమైన లిప్‌లాక్ సీన్ల‌తో పాటు ఘాటు రొమాన్స్ సన్నివేశాలకు అంతే లేదు.

శింబు నయనతారను ఎత్తుకుని బెడ్ పైకి తీసుకెళ్ళి చేసిన రొమాన్స్ పెద్ద రచ్చ రచ్చ అయింది. అదే శింబు నయనతారతో నిజజీవితంలోనూ అదే తరహాలో రొమాన్స్ చేశాడన్న గుసగుసలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో బయట ఎక్కడ కనిపించినా ఆ ఫోటోలు మీడియాలో హైలెట్ అయ్యింది. చివరకు పెళ్లి వరకు వెళుతుంది అనుకున్న ప్రేమ బ్రేకప్ అయింది. ఆ తర్వాత నయనతార సూపర్ స్టార్ అయితే శింబు కేరియ‌ర్  వెళ్ళిపోయింది. ఏదేమైనా మన్మధ సినిమాలో నయనతారతో శింబు చేసిన రొమాన్స్ లిప్ లాక్ సీన్లు ఇప్పటికీ బుల్లితెరపై చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో సెగలు రేగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: