టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ నుంచి రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోావడంతో ఖంగు తిన్న పవన్ కళ్యాన్ ఇక మూవీస్ బెట్టర్ అనుకున్నారో ఏమో మళ్లీ వెండి తెరపై వెలిగిపోయేందుకు ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాల కారణంగా పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత మరో మూవీలో నటించలేదు. అయితే పవన్ కళ్యాన్ ని వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా తెగ ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రిమేక్ లో నటిస్తున్నాడు. నిన్న రిలీజైన వకీల్ సాబ్ మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా వేధికగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో రెోజుల నుంచి తెగ ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్ రావడంతో సంబరాల్లో ఉన్నారు ఫ్యాన్స్. పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా హైప్ ఆకాశాన్నంటుంతోంది. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కు లభిస్తున్న స్పందనే అందుకు నిదర్శనం.
కేవలం 24 గంటల వ్యవధిలో 3.5 మిలియన్ల టైటిల్ ట్యాగ్ లతో వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మరే ఫస్ట్ లుక్ ఈ ఘనత సాధించలేదు. అంతేకాదు, టాలీవుడ్ లో అత్యధికంగా 25.3 వేల సార్లు మాత్రమే వచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో హిట్టయిన పింక్ ని తమిళ్ లో అజిత్ కుమార్ నటించాడు.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.