బాహుబలి సినిమా ద్వారా నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ తన తర్వాతి చిత్రాలని బాలివుడ్ దర్శకులతో తీస్తాడని చాలా మంది భావించారు. కానీ ఎందరో పెద్ద పెద్ద దర్శకులని పక్కన పెట్టి సుజిత్ తో సాహొ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన సుజిత్ తో ప్రభాస్ సినిమాచేయడానికి సాహసించాడు.. ఫలితం అనుభవించాడు. అయితే సాహో సినిమా తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది.

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం సురేందర్ రెడ్డితో గానీ, సందీప్ వంగాతో గానీ సినిమా చేస్తాడని భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ తన తర్వాతి సినిమా నాగ్ అశ్విన్ తో అని ప్రకటించాడు. మహానటి వంటి క్లాస్ సినిమా తీసిన నాగితో ప్రభాస్ సినిమానా అని అందరూ ఆశ్చర్యపొతున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉండబోతుందట.

 

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులని పూర్తిగా సిద్ధం చేసుకుంది. జాన్ సినిమా షూటింగ్ పూర్తవగానే ప్రభాస్ ఇమ్మీడియెట్ గా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట. అయితే నాగితొ సినిమా తర్వాత ప్రభాస్ మరోసారి మిర్చి కొరకాలని అనుకుంటున్నాడట. అవును కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడని టాక్. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ తో గోవింద ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

సినిమా పూర్తయ్యాక ప్రభాస్ కోసం కథని సిద్ధం చేస్తాడట. ఇదంతా నిజమైతే మరోసారి ప్రభాస్ ని మంచి మాస్ సినిమాలో చూసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్ల దృష్ట్యా వీరిద్దరి కాంబోలో సినిమా రావాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: