పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీకి సంబంధించి హీరోయిన్ విషయంలో కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు కీర్తి సురేశ్ లేవనెత్తిన అభ్యంతరాలకు క్రిష్ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ నటిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా మార్చడానికి అనేక వ్యూహాలు అనుసరిస్తున్న క్రిష్ ఈ మూవీకి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గురించి అన్వేషణ చేస్తున్నాడు.

 

ఈ అన్వేషణలో భాగంగా క్రిష్ ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గా నటించే సెలెబ్రెటీకి 2 నుంచి 3 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. దీనితో ఈ మూవీలో నటించేందుకు వాణీ కపూర్ జాక్వీలిన్ పూజ హెగ్డే కీయరా అద్వాని లాంటి టాప్ క్రేజీ బ్యూటీలు ఈ మూవీలో నటించేందుకు ప్రాధమికంగా అంగీకారం తెలిపినా క్రిష్ కోరుకునే విధంగా బల్క్ డేట్స్ ఇవ్వడానికి నో చెపుతున్నట్లు సమాచారం. 


అయితే ఈ మూవీలో క్రిష్ కోరుకునే విధంగా కీర్తి సురేశ్ డేట్స్ ఇవ్వడానికి అంగీకరించినా పవన్ మూడ్ కు తగ్గట్టుగా ఒకరోజు షూటింగ్ చేసి మరొక రెండు రోజులు ఖాళీగా ఉండటానికి కీర్తి అంగీకరించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తన బల్క్ డేట్స్ ఎన్నిరోజులు కావాలో స్పష్టంగా చెప్పమని ఈమధ్యలో పవన్ రాజకీయాల కోసం షూటింగ్ బ్రేక్ పడితే తాను అదనపు డేట్స్ ఇవ్వను అనీ స్పష్టంగా కీర్తి క్రిష్ కు కండిషన్స్ పెడుతున్నట్లు టాక్.


దీనితో కీర్తి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏ క్షణం ఎలా పవన్ మూడ్ ఉంటుందో తెలియక క్రిష్ భారీ పారితోషికం ఇచ్చి కూడ ఈ మూవీకి టాప్ హీరోయిన్ ను పెట్టుకోలేని పరిస్థితులో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయమని పవన్ చెపుతున్నా అతడి మాటలు పూర్తిగా నమ్మలేక టాప్ హీరోయిన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రిష్ విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: