టాలీవుడ్ లో మనం సినిమాతో అక్కినేని హీరోలందరినీ ఒక్క చోట చేర్చిన ఘనత సంపాదించాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. విభిన్న కథనాలతో తన సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్నారు. మనం సినిమా తర్వాత సూర్యతో చేసిన `24`, అఖిల్తో చేసిన `హల్లో`, నాని నటించిన `గ్యాంగ్ లీడర్` వరుసగా ఫ్లాప్ కావడంతో ఇబ్బందుల్లో పడ్డారు విక్రమ్ కుమార్. ఈ మూడు సినిమాలు టాక్ పరంగా బాగున్నా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేక పోయాయి. అయితే విక్రమ్ తో సినిమాలు తీసేందుకు హీరోలు మంచి ఇంట్రెస్ట్ చూపుతున్నా.. ఆయన మాత్రం వేరే రూట్ లోకి వెళ్తున్నట్టు సమాచారం. ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సినిమాల్లో కన్నా డిజిటల్ రంగం వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం డిజిటల్ మీడియా హావ బాగా నడుస్తుంది..దీంతో అగ్ర నటి నటులే కాదు దర్శక , నిర్మాతలు కూడా వెబ్ సిరీస్ లపైనే మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే క్రేజ్ నటి నటులు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ విక్రమ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన్ని అమెజాన్ ప్రైమ్ సంప్రదించి ఓ డీల్ని కుదుర్చుకుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ వెబ్ సిరీస్లో నాగచైతన్య, అనుష్క కీ రోల్స్ పోషించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇది నిజమా కదా అనేది తెలియాల్సి ఉంది. కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ వర్క్ స్టైల్ మార్చుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో వెబ్ సీరీస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక సినీ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సీరీస్ రంగం వైపు తమ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రిస్క్ తక్కువ ఆదాయం ఎక్కువ అన్నే రీతిలో వీరు వెళ్తున్నట్లు సమాచారం.