పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బోనీ కపూర్ తో పాటు దిల్ రాజు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టింది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, అంజలి, అనన్య ఇతర పాత్రలలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ మరొక సినిమాలో నటిస్తున్నారు ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం తన సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా ఫీల్ తో నిర్మిస్తున్నారు. 

 

అయితే ఈ రెండు సినిమాల తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నారు. ఇటీవల దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్సుమెంట్ కూడా రావడం జరిగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకోవడం జరిగింది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈ ఏడాది చివరిలో కానీ, లేదా వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత కానీ సెట్స్ మీదకు వెళ్ళదని అంటున్నారు. 

 

ముందుగా పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ మే లో రిలీజ్ అవుతుండగా, ఆపై క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారని, ఇక హరీష్ తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది దసరా సమయానికి సిద్ధం అవుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే వారి నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: