తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం ఎవరితో అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో వంశి పైడిపల్లి తో ఓ చిత్రం ఉండబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు మహేష్ బాబు.  ఈ చిత్రం సాధించిన విజయంతో వరుసగా హ్యాట్రిక్ సాధించినట్టయ్యింది. గత ఏడాది మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి బ్లాక్ బస్టర్ అయ్యాయి.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో రైతు గౌరవం ఇనుమడింపే విధంగా తెరకెక్కించారు.  ఈ చిత్రం సోషల్ మెసేజ్ ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది. 

 

తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత వంశి పైడి పల్లి ఓ స్క్రిప్ట్ తీసుకొని వెళ్లారట. కానీ మహేష్ బాబు కి ఈ స్క్రిప్ట్ అంత బలంగా అనిపించలేదట.. దాంతో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోని రావాల్సిందిగా కోరారట.  దాంతో వంశి చాలా సమయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు.  కానీ ఆయన తన వద్ద అంతకు మించి అనే విధంగా కథలు ఉన్నాయని అంటున్నారు. ఈ లోగా మహేష్ బాబు ‘గీతాగోవిందం’ డైరెక్టర్ పరుశరామ్ ని లైన్లో పెట్టినట్లు ఈ మద్య వార్తలు వచ్చాయి.  అయితే  మహేశ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం .. ఈ విషయంపై జరిగిన ప్రచారం వంశీ పైడిపల్లిని చాలా బాధించాయనే టాక్ వినిపించింది.

 

వంశి పైడి పల్లి మాత్రం మరో  లైన్ ను రెడీ చేసి, మహేశ్ బాబుకి వినిపించాడట. ఆయనకి లైన్ నచ్చేసి ఓకే అనడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.  ఉరుకులు పరుగుల స్క్రిప్ట్ తో అయ్యే పని కాదని ఎలాగూ అర్థమైంది.. అంతే , పరశురామ్ తరువాత సినిమాను తనతోనే మహేశ్ బాబు చేసేలా వంశీ పైడిపల్లి సెట్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. గతంలో కూడా మహేష్ బాబు కోసం వంశి పైడిపల్లి రెండేళ్లు ఎదురు చూశారని ఇటీవల ఓ కార్యక్రమంలో మహేష్ బాబు స్వయంగా చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: