ఇటీవల కెరీర్ పరంగా వరుసగా అపజయాలు చవిచూసిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ , కొద్దిరోజుల క్రితం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. పలు కమర్షియల్ హంగులతో పాటు ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టి రామ్ కు కెరీర్ పరంగా మంచి సక్సెస్ ని అందించింది. ఇక తనకు గతంలో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి మంచి సినిమాలు అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్. కొద్దిరోజుల క్రితం తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా ఒక విభిన్నమైన థ్రిల్లింగ్, యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ కొట్టడంతో, దానిని తెలుగు రైట్స్ ని కొనుగోలు చేసి, స్రవంతి మూవీస్ సంస్థ రామ్ తో రెడ్ పేరుతో ఆ సినిమాని రీమేక్ చేస్తోంది. 

 

రామ్ తొలిసారిగా తన కెరీర్ లో డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్ నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని, సమీర్ రెడ్డి ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్రేజ్ సంపాదించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. 

 

ఇకపోతే ఈ సినిమా నుండి నువ్వే నువ్వే అనే పల్లవి తో సాగే మొదటి సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. గతంలో రామ్, మణిశర్మల కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ శ్రోతలను ఎంతో బాగా అలరించాయి. అలానే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటోంది సినిమా యూనిట్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: