సినీ పరిశ్రమలోఒకప్పుడు క్యారవ్యాన్ కల్చర్ లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా షూటింగ్ స్పాట్ లో ఉన్న సౌకర్యాన్ని బట్టి అడ్జెస్ట్ అయ్యోవారు.  కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కో స్టార్ హీరోకి ఒక్కో క్యారవ్యాన్. ఇప్పుడున్న స్టార్ హీరోల క్యారవ్యాన్ ఖరీదే కోట్లలో ఉంది. ఈ పద్ధతి మార్చుకోవాలని ఇటీవల ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి సూటిగా సూచించిన సంగతి తెలిసిందే. నేను క్యారవ్యాన్లను కేవలం మేకప్ వేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని ఓపెన్ గా క్లారిటి ఇచ్చారు మెగాస్టార్. ఇప్పుడు ఇదే విషయంలో సీనియర్ నటి కవిత షాకింగ్ కామెంట్స్ చేసారు. 

 

ఒకప్పుడు మాకు క్యారవ్యాన్లు ఉండేవి కావు. చెట్ల కింద మేకప్ వేసుకునేవాళ్లం, అక్కడే తినేవాళ్లం. చెప్పాలంటే చెట్ల వెనకాలే దుస్తులు కూడా మార్చుకునేవాళ్లం. ఒక సినిమా షూటింగ్ సమయంలో నన్ను దుస్తులు మార్చుకుని రావాలని చెప్పారు. అప్పుడు నేను హీరోయిన్ క్యారవ్యాన్‌లోకి వెళ్లి మార్చుకోవాలని అనుకున్నా. కానీ ఆ హీరోయిన్ ఒప్పుకోలేదు. ఇది నా క్యారవ్యాన్. మీరు లోపలికి ఎలా వెళ్తారు అని మొహమాటం లేకుండా తోటి ఆడ మనిషి అని కూడా ఆలోచించకుండా తెగేసి చెప్పింది. అప్పుడు ప్రభుదేవా వచ్చి మేడమ్ మీరు నా క్యారవ్యాన్‌లోకి వెళ్లండి అన్నారు అని తెలిపింది.

 

చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ ఇలా పెద్ద పెద్ద హీరోలకు ఇలాంటి పద్ధతులు తెలీదు. కానీ ఇప్పుడిప్పుడు వస్తున్న చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకే ఈ పొగరు. అది మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు అందరం ఒకే దగ్గర కూర్చుని తర్వాతి సన్నివేశం ఏంటి అని డిస్కస్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు అలా కాదు ప్రతీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి వారి క్యారవ్యాన్లలో కూర్చుని స్క్రిప్ట్ రిపీట్ చేస్తూనే ఉండాలి. దీని వల్ల పూర్తిగా నష్టపోతుంది నిర్మాతే. ఆ విషయం కొంతమందికి నిర్మాతలకి అర్థం కావటం లేదు. అందుకు ఒక కారణమూ ఉంది.

 

'నా క్యారవ్యాన్‌లోకి నువ్వు వెళ్లకూడదు అని ఓ హీరోయిన్ నాతో అన్నప్పుడు అక్కడే ఉన్న నిర్మాత ఆమెను తిట్టాల్సిందిపోయి చూస్తూ నిలబడిపోయాడు. నిర్మాతలే వీపులు గోకేస్తున్నారు. అలాంటప్పుడు చిరంజీవిలాంటి వాళ్లు ఎంత మాట్లాడి ఏం లాభం. నాకు తెలుగులో అవకాశాలు రావడంలేదు. నేను వరుసగా తమిళ సినిమాలు చేస్తున్నాను. తెలుగు మేకర్స్ తెలుగు నటులకే అవకాశం ఇవ్వడం లేదు. ఇంకా ఎంత కాలం ఇలా చేస్తుంటారో. అందుకే కొంతమంది రోడ్డెక్కి తెలుగు వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడం లేదని రచ్చ చేస్తున్నారు .. ఊరికే కాదు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: