టాలీవుడ్ లో ప్రభాస్ కి మిర్చి సినిమాతో వచ్చిన ఇమేజ్ వేరు. ఈ సినిమా లాంటి కథనే మళ్ళీ ప్రభాస్ చేయాలనుకుంటున్నట్టు రీసెంట్ గా వెల్లడించాడు కూడా. ఇక దర్శకుడు కొరటాల శివ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. మిర్చి సినిమా ముందు వరకు ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా పని చేసిన కొరటాల ఈ సినిమాతో డైరక్టర్ గా టాలీవుడ్ లో సత్తా చాటారు. మిర్చీ సినిమా నుంచి భరత్ అనే నేను సినిమా వరకు ఫ్లాప్ అన్నదే లేకుండా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ వచ్చారు. అందుకే అతి కొద్ది కాలంలోనే మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తున్నారు. 

 

అయితే ఈ మధ్య కొరటాల గురించి ఫ్యాన్స్ లో ఒక ఆసక్తికరమైన విషయం చర్చలోకి వచ్చింది. అదేమిటంటే కొరటాల సూపర్ స్టార్ మహేష్ బాబు తో రెండు సినిమాలు చేసారు. ఎన్టీఆర్ తో రెండవ సినిమాని కమిటయి ఉన్నారు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా చేయబోతున్నారట. మరి కొరటాలకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టిన ప్రభాస్ తో మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తారని హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు. అయితే త్వరలో అందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని తాజా సమాచారం. ప్రభాస్, కొరటాల కాంబోలో మళ్లీ సినిమా తీసే సన్నాహాలలో మైత్రీ మూవీస్ సంస్థ వారు ఉన్నారట. 

 

అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధేశ్వామ్ సినిమా అలాగే నాగ్ అశ్విన్ సినిమా తర్వాతే కొరటాల తో సినిమా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకే దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడే ప్రభాస్ ఫ్రీ అవుతాడు. అయితే ఇక్కడ ఇంకో అవకాశమూ లేకపోలేదు. నాగ్ అశ్విన్ కనుక ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటే ఈ లోగా కొరటాలతో సినిమా కంప్లీట్ చేసే విధంగా కూడా మైత్రీ మూవీస్ రెడీగా వుందట. అయితే అన్నీ కుదిరితే కొరటాల చిరంజీవి సినిమా తర్వాత అయితే రాం చరణ్ తోనే సినిమా చేస్తాడని ఒక మాట వినిపిస్తుంది. ఆ తర్వాతే ఎన్.టి.ఆర్ తో ప్రాజెక్ట్ ఉంటుందట. ఈ రెండు అయ్యాకే ప్రభాస్ తో సినిమా ఉండొచ్చునట.  మరి ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: