టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోల పరిస్థి చూస్తుంటే ఇక దుకాణం కట్టేయాల్సిందేనన్న టాక్ వినిపిస్తుంది. వాళ్ళలో ముందుగా రాజ్ తరుణ్ పేరే వినిపిస్తుంది. కుమారి 21 ఎఫ్ తర్వాత మళ్ళీ ఈ కుర్ర హీరోకి ఆ స్థాయి హిట్ దక్కనేలేదు. వరుసగా ఫ్లాప్ ల మీద ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అయినప్పటికి రాజ్ తరుణ్ కి మాత్రం వరుసగా సినిమాల అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నిజంగా ఇంకా భూమి మీద నూకలున్నాయి అన్నట్టుగా రాజ్ తరుణ్ కి కాస్తో కూస్తో లక్ ఫేవర్ చేస్తుంది. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ నిరాశ పరచాడు. రెండు నెలల గ్యాప్ లోనే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 

 

విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా మాళవిక నాయర్, హెబ్బా పటేల్ నటించారు. అయితే ఈ హీరో హీరోయిన్స్ ది కాస్త బ్యాడ్ టైం నడుస్తోంది. హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ హిట్స్ చూసి చాలా కాలమే అయింది. ఇక మాళవిక నాయర్ గురించి చెప్పడానికి ఏమీలేదు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో రాజ్ తరుణ్ రెండు ప్రేమ కథలు చూపించారు. సినిమా మెయిన్ ప్లాట్ ఏంటో క్లారిటీ ఇవ్వనప్పటికి రాజ్ తరుణ్ రెండు ప్రేమ కథలు నడిపినట్లుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరిగానే కామెడీ, లవ్ సీన్స్ సినిమాలో ఉంటాయని ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. 

 

అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ అన్నది రాజ్ తరుణ్ కు చాలా ఇంపార్టెంట్. ఈ కుర్ర హీరో కెరీర్ లో ఇప్పటికే చాలా ఫ్లాప్ లు పడి ఒడ్డున పడ్డ చేప పిల్లలా కొట్టుకుంటున్నాడు. టైం బ్యాడ్ అయి ఈ సినిమా కూడా దెబ్బేస్తే ఇక రాజ్ తరుణ్ కెరీర్ ఢమాల్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుండెజారి గల్లంతయ్యిందే ఒక లైలా కోసం సినిమాలతో హిట్ దక్కించుకున్న విజయ్ కుమార్ కొండ చాలా రోజుల తర్వాత మళ్ళీ సక్సస్ కోసం గట్టిగా టరి చేస్తున్నాడు. మరి అందుకు రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తాడా లేదా చూడాలి. అయితే టీజర్ మీద మాత్రం జనాలకి అంత మంచి అభిప్రాయం ఏర్పడలేదు. అందుకే ఇక నువ్వు సినిమాలు ఆపేసి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరు సరిపోద్ది .. అంటూ సలహాలిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: