టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్ది రోజుల క్రితం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందాలతార రష్మిక మందన్న మహేష్ కు జోడీగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి భారతి అనే పాత్రలో నటించి మెప్పించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక దీని తర్వాత మహేష్ నటించబోయే తదుపరి సినిమా గురించి గతకొద్దిరోజులుగా టాలీవుడ్ వర్గాల్లో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

 

అయితే నేడు కొందరు మహేష్ బాబు సన్నిహితుల నుండి అందుతున్న అధికారిక సమాచారాన్ని బట్టి, మహేష్ తదుపరి నటించబోయే 27వ సినిమా మెగాస్టార్, కొరటాల కలయికలో తెరకెక్కుతున్న సినిమానే అని, అలానే దాని తర్వాత యంగ్ డైరెక్టర్  పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయనున్నారని అంటున్నారు. నిజానికి ఈ రెండు సినిమాల కంటే ముందు మహేష్, వంశీ పైడిపల్లి సినిమా చేయాల్సి ఉంది. అయితే వంశీ చెప్పిన కథ యొక్క పూర్తి స్క్రిప్టు సిద్ధం కాకపోవడంతో, దానిని పక్కన పెట్టి, ఈ రెండిటిని ప్రస్తుతం లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. 

 

అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, చిరంజీవి, కొరటాల కాంబో సినిమాలో మహేష్ బాబు పాత్ర నిడివి 30 నిమిషాల పాటు ఉంటుందని, అంతేకాక ఆ పాత్ర సినిమాలో ఎంతో కీలకం అని అంటున్నారు. అలానే పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ఎంతో డిఫరెంట్ గా యూత్ ని రిప్రజెంట్ చేసేలా ఉంటుందని, అలానే మహేష్ బాబు ఆ సినిమాలో ఒక ఫ్రెష్ లుక్ లో కనపడతారని అంటున్నారు. సో దీనినిబట్టి చూస్తే మహేష్ బాబు తదుపరి నటించబోయే 27, 28 వ సినిమాలు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కాగా మరికొద్ది రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడడమే తరువాయి అని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: