పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ‘పింక్’ రీమేక్ కావడంతో  పాటు ఈమూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి బాలీవుడ్ లో కూడ విడుదల చేస్తున్నారు. దీనికితోడు ఈసినిమాకు సహ నిర్మాతగా బాలీవుడ్ ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ వ్యవహరిస్తున్న పరిస్థుతులలో అతడి కొడుకు బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ ఈసినిమా ఫ‌స్ట్ లుక్ ను బాలీవుడ్ మీడియాకు షేర్ చేశాడు.


సాధారణంగా అయితే తెలుగు సినిమాల గురించి పెద్దగా బాలీవుడ్ మీడియా పట్టించుకోదు. అయితే ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ ను చూసి బాలీవుడ్ మీడియా ఆశ్చర్యపోతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘పింక్’ మూవీ కథకు సంబంధించి ఆమూవీలో నటించిన ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం. వాస్తవానికి ఈ మూవీలో బాలీవుడ్ వెటరన్ స్టార్ అమితాబ్ నటించినప్పటికీ ‘పింక్’ సినిమాను అమ్మాయిలు లీడ్ చేసిన సినిమాగానే అక్కడి మీడియా భావించింది. 


దీనికితోడు ఈమూవీలో అమితాబ్ లుక్ వయసు పై బడిన పాత్ర. అయితే ‘వ‌కీల్ సాబ్’ కు వచ్చే సరికి ఈమూవీలో నటిస్తున్న పవన్ లుక్ ను పూర్తిగా మార్చడమే కాకుండా ఈమూవీలోని ప్ర‌ధాన పాత్ర‌లైన అమ్మాయిల రోల్స్ ను తగ్గించి పవన్ పాత్రను విపరీతంగా పెంచి పవన్ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా ఒక తిక్క లాయర్ గా చూపెడుతున్నారు. దీనితో ఈ మార్పులను పసిగట్టిన బాలీవుడ్ మీడియామూవీ ఫస్ట్ లుక్ పై విమర్శలు చేస్తూ ఒక ఉదాత్తమైన సినిమా కథను కమర్షియల్ సినిమాగా మార్చడం ఏమిటి అంటూ బాలీవుడ్ మీడియా ఎదురు ప్రశ్నలు వేస్తోంది. 

 

ఇది ఇలా ఉండగా రెండు మూడు వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి అయిపోతుంది అని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కోర్టుకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ జరుపుతున్నారు టాక్. కోర్టు సీన్ లో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం  చూపించదానికి ప్రయత్నిస్తూ ఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. ఈసినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న నివేదా థామస్ తన అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ కొన్ని సందర్భాలలో పవన్ నటనను డామినేట్ చేస్తోందని టాక్. దీనితో ఎలర్ట్ అయిన దర్శకుడు వేణు శ్రీరామ్ నివేదా ఇస్తున్న యాక్షన్ ఫీలింగ్స్ కు కొద్దిగా చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ నటన హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: