పూజా హెగ్డే ప్రస్తుతం ఎటు చూసినా ఈమె పేరు టాలీవుడ్లో మారుమ్రోగుతోంది. ఏ కొత్త సినిమాలో చూసినా... ఏ హీరో పక్కన అయినా హీరోయిన్గా బుక్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ భామ స్టార్ స్టేటస్ హోదాలో ఉందనే చెప్పాలి. ఇక ఈమె తెలుగులో అగ్ర హీరోలందరి సరసన ప్రస్తుతం హీరోయిన్గా బుక్ అయింది. అయితే ఈమె తెలుగులోనే కాక అటు బాలీవుడ్లోనూ చక్రం తిప్పుతోంది. ఇటీవలె విడుదలైన హౌస్ఫుల్ చిత్రంలో నటించి మెప్పించింది. అంతేకాక మరికొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం హీరోయిన్ గా అగ్ర కిరీటాన్ని మోస్తోంది ఈ బ్యూటీ. ఇక స్టార్టింగ్లో ఈ భామ ఐరెన్ లెగ్ అనే టాక్ తెచ్చుకుంది. సడెన్గా డీజే చిత్రంతో ఈమె జాతకం మారిపోయింది. ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది.
డీజే దువ్వాడజగన్నాధం అల్లుఅర్జున్ సరసన హీరోయిన్గా నటించింది పూజా. ఈ సినిమా మీద డివైడ్ టాక్ వినిపించినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. ఎందుకా అనుకుంటున్నారా...ఇంతలో సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే స్విమ్ సూట్ తో హీరోతో పాటు ప్రేక్షకుల మతి పోగొట్టిన సీన్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయి కుర్రాళ్ళకు కాకరేపింది. తెల్లటి అందాల మధ్య నల్లటి బికినీలో ఈమె అందాలు కుర్రాళ్ళకి ఎంత సెగలు రేపాయంటే... కేవలం సినిమాని ఆ ఒక్క సీన్ కోసం చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాక అల్లుఅర్జున్ తనకు మధ్య జరిగే సంభాషణ కూడా చాలా బావుంటుంది. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి బట్టలు వేశారు అంటారు. అది సినిమాకి హైలెట్గా నిలిచింది. అంతేకాక ఇలాంటి దుస్తుల్లో చూస్తుంటే నర నరాల్లో ఒణుకుపుడుతోంది అంటాడు. మరి హీరోకే ఒణుకుపుడితే మాములు జనాల పరిస్థితి ఏమిటి పూజా అన్నట్లు ఉంది ఆమె స్టిల్ ఆ మూవీలో. ఇక ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఏ సినిమాలో చూసినా ఈమె.