టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ప్రత్యేక స్థానం ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమాతో ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లోనూ అతనికి క్రేజ్ ఏర్పడింది. యూత్ లో విజయ్ కి చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ పట్ల అభిమానం చాలా ఎక్కువ. అతని సినిమా ఫస్ట్ డే రోజున అమ్మాయిలే ఎక్కువగా థియేటర్లకి వస్తుంటారు. అయితే దేవరకొండకి ఉన్న అమ్మాయిల ఫాలోయింగ్ ని తనకోసం వాడుకోవాలని అనుకున్నాడు ఒక నేరగాడు.

 

అందుకని విజయ్ దేవరకొండ పేరు మీద సోషల్ మీడియాలో ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయిలకి మెసేజ్ లు పంపుతూ ఉన్నాడట. అలా పంపేది విజయే అనుకునే కొందరు అమ్మాయిలు ఆ ఫేక్ ప్రొఫైల్ తో రోజూ చాట్ చేస్తున్నారట. దాన్ని ఇంకా అదునుగా తీసుకున్న ఆ నేరగాడు ఆ అమ్మాయిల నంబర్లు తీసుకునే వాడట. దేవరకొండ నంబర్ అంటూ ఒకానొక నంబర్ ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసాడు.

 

అదే నిజమై నమ్మిన అమ్మాయిలు ఆ నేరగాడి వలలో పడిపోతున్నారు. అయితే తన పేరు మీద ఫేక్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని గమనించిన దేవరకొండ.. తన అసిస్టెంట్ సాయంతో అసలు విషయం కనుక్కుని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆ నేరగాడు పోలీసుల అదులులో ఉన్నాడు. పోలీసులు విచారణలో భాగంగా ఆ నేరగాడి ఫ్యామిలో డిటైల్స్ కలెక్ట్ చేస్తున్నారట.

 

ఇదిలా ఉంచితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి, చార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు తో పాటు హిందీ, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: