సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉంటారు. ప్ర‌స్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్నాడీయ‌న‌. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. బికినీతో మ‌హేష్‌కే మైండ్ బ్లాక్ చేసిందెవ‌రంటే.. హీరోయిన్ త్రిష్‌.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన చిత్రం అత‌డు. 2005లో విడుద‌లైన ఈ చిత్రంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న త్రిష హీరోయిన్‌గా న‌టించింది.

 

 ఆ సినిమాలో త్రిష‌ చేసిన పూరి పాత్రను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేరు. మ‌రియు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో క్లాసిక్‌గా నిలచిన చిత్రం అతడు. అంతేకాదు నిజం చిత్రం తరువాత ఉత్తమ నటుడుగా మహేష్‌కు మరోసారి నంది  పురస్కారాన్ని తెచ్చిపెట్టిన చిత్రం ఇది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో `నీతో చెప్పనా` అనే సాంగ్‌లో త్రిష బికినీతో అద‌ర‌గొట్టేసింది. 

 

అటు మ‌హేష్ బాబును.. ఇటు కుర్ర‌కారును అప్పట్లో త‌న అందంలో త్రిష‌ ఓ ఊపు ఊపేసింది. మ‌హేష్ బాబు, త్రిష కాంబినేష‌న్‌లో ఆ సినిమా మ‌రియు సాంగ్స్‌ పెద్ద సంచ‌ల‌నంగా మారాయి. మ‌రియు మణి అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక ఈ చిత్రంలో మ‌హేష్‌ బాబు కామెడీ టైమింగ్‌, త్రిష‌తో రొమాంటిక్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. కాగా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను.. మూడు నంది అవార్డులతో పాటు పలు ప్రాంతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. హిందీలో ‘ఏక్’ పేరుతోనూ, బెంగాలీలో ‘వాంటెడ్’ పేరుతోనూ రీమేక్ చేయ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: