‘అర్జున్ సురవరం’ మూవీ చెప్పుకోతగ్గ విజయం సాధించక పోయినా వెంటనే నిఖిల్ మరో సినిమాను ప్రకటించడంతో నిఖిల్ దూకుడు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అవుతున్నాయి. 


’18 పేజెస్’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీ కథను దర్శకుడు సుకుమార్ వ్రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ మూవీ డైరెక్టర్ సూర్య ప్రతాప్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. వాస్తవానికి ఈ కథను పుచ్చుకుని సూర్య ప్రతాప్ అనేకమంది యంగ్ హీరోల చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. 


సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో నటిస్తానని ముందుగా ఒప్పుకుని చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చాడని టాక్. ఈ మూవీ సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ చుట్టూ కథ తిరగడంతో సాయి తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటారు. అయితే నిఖిల్ మాత్రం ఈవిషయాలు ఏమి పట్టించుకోకుండా చాల ధైర్యంగా ఈ మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పడమే కాకుండా ఈ మూవీ కథలో కొన్ని మార్పులు కూడ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


అల్లు కాంపౌండ్ కు చెందిన బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నటించే అవకాశం సాయి ధరమ్ తేజ్ వదులుకోవడంతో ఇప్పుడు నిఖిల్ ను ఆ అదృష్టం వరించింది. దీనితో నిఖిల్ కు టర్నింగ్ వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు ‘18 పేజెస్’ అన్న టైటిల్ పెట్టడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా సూర్య ప్రతాప్ కు కలిసి రావడంతో ఇప్పుడు అలాగే నెంబర్ సెంటిమెంట్ ను గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. సుకుమార్ స్క్రిప్ట్ లో ఊహించని ట్విస్ట్ లు చాల ఉంటాయి. ఇలాంటి ట్విస్ట్ లు ఈ మూవీలో కూడ అనేకం ఉంటాయి అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: