ప్ర‌తి ఒక్క‌రూ జీవితంలో కొన్ని అనుకుంటూ ఉంటాం. అది స‌ర్వ సాధార‌ణం అయితే కానీ అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌క‌పోతే చాలా ఫీల‌వుతుంటాం. కొన‌ని సంద‌ర్భాల్లో చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం .అయితే వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది సాయిప‌ల్ల‌వి. ఇటీవల ఒక మీడియా ఇంట‌ర్వ్యూలో ఈ భామ‌... ఏదైనా జరగాలని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరంది. అందుకే అలాంటి సమస్యలు ఎదురైతే.. అందులోంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని ..అంతేగానీ, ‘ఆశించింది జరగలేదే’ అని నిరుత్సాహపడకూడదని అంది. ‘ఏం జరిగినా మన మంచికే’ అని భావించడం తనకు చదువుకునే రోజుల నుంచే అలవాటైందని చెప్పింది. ఆ అలవాటు ఇప్పుడు ఈ రంగంలో హెల్ప్‌ అవుతోందని చెప్పింది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మాత్రం అది మ‌న‌కు ఒక లెస్స‌న్ లాంటిద‌ని కేవ‌లం అది  నేర్చుకోవడానికే అది జరిగిందని భావిస్తానని అంది. మ‌రి ఇంత పాజిటివ్ నెస్ అంద‌రిలో ఉండ‌డం కాస్త క‌ష్ట‌మే.


 

‘ఫిదా’ తో ఆకట్టుకున్న సాయి పల్లవి.. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ లో నటిస్తోంది.. నాగచైతన్య హీరోగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌, వీడియోకు విశేష స్పందన లభించింది. ప్రేక్ష‌కులు వాటికి ఫిదా అయిపోయారు. సాయి పల్లవి మ‌రిన్ని మాట‌లు ఏం చెప్పిందంటే... ‘‘హీరోతో కెమిస్ట్రీ విషయంలో ఎలాంటి కసరత్తులు ఉండవు. పాత్రను, కథను అర్థం చేసుకుంటే సగం పని అయిపోయినట్టే. కథకు, పాత్రకు సంబంధం లేని పాత్రలు చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సినిమాలకు నో చెప్పా’’ అని అన్నారు.
 

 

అలాగే తాజాగా సాయి పల్లవికి అరుదైన ఘనత దక్కింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా `ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30` జాబితాను విడుదల చేసింది. 30 సంవత్సరాలలోపు తమ తమ రంగాల్లో విజయాలను సాధించిన 30 వ్యక్తుల జాబితాను ఈ మ్యాగ్‌జైన్ వారు ప్రకటించారు. ఆ జాబితాలో 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు దక్కించుకుంది. దీంతో సాయిపల్లవి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ర మ‌రి ఇది మాములు విష‌యం కాదుక‌దా.

మరింత సమాచారం తెలుసుకోండి: