టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు దిల్ రాజు కి మంచి పేరుంది. అగ్ర హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా చిన్న సినిమాలను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారని టాలీవుడ్ జనం అంటారు. ఆయన కూడా అదే విధంగా చిన్న చిన్న సినిమాలను దృష్టి లో పెట్టుకుని, వాటి కథలను వింటూ కథ బాగుంటే ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అందరు అగ్ర హీరోలతో ఆయన దాదాపుగా సినిమాలు చేసేసారు కూడా. ఆయన చేయని హీరో టాలీవుడ్ లో ఎవరు లేరు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన చిన్న సినిమాలు అంటే భయపడుతున్నారట. దీనికి కారణం కూడా లేకపోలేదు. చిన్న సినిమాలు ఆయనకు ఈ మధ్య ఇబ్బందికరంగా మారాయి. అవకాశాలు ఇచ్చి చిన్న హీరోలతో సినిమాలు చేస్తుంటే ఆయన నష్టపోతున్నారు. ఈ మధ్య వచ్చిన శర్వానంద్ నటించిన జానూ సినిమా ఆయనకు భారీ నష్టాలే మిగిల్చింది అని చెప్పవచ్చు. దీనితో ఇప్పుడు దిల్ రాజు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ కూడా దాదాపు అగ్ర హీరోల సినిమాలే. 

 

రాబోయే రెండు మూడేళ్ళలో దిల్ రాజు చేయబోయే సినిమాలు అన్నీ కూడా అగ్ర హీరోలతోనే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా కొందరితో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. అలాగే నానీ తో పాటుగా మరి కొందరు రెండో గ్రేడ్ హీరోలతో సినిమాలు చేయాడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమాలు అన్నీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అయిన తర్వాత దిల్ రాజు తోనే ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: