టాలీవుడ్ లో అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తూ కూడా రామ్ చరణ్ ఇప్పుడు వరుసగా తన తండ్రి తో సినిమాలు చేస్తున్నాడు. తన తండ్రి రీ ఎంట్రీ సినిమాగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాను రామ్ చరణ్ నిర్మించారు. ఆ సినిమాతో భారీగా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత తన తండ్రి తో కలిసి సైరా సినిమాను చేసాడు. ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ని ఆచార్య అని అనుకుంటున్నారు. 

 

త్వరలోనే టైటిల్ కి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత మలయాళం లో మోహన్ లాల్ నటించిన సినిమా, లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత చిరు సినిమాలు అన్నీ కూడా రామ్ చరణ్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. చిరంజీవికి రామ్ చరణ్ మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు టాలీవుడ్ జనం. దానికి పెద్ద కారణం ఏంటీ అంటే... 

 

కొరటాల శివ తో చేస్తున్న సినిమాలో చిరంజీవి పారితోషికం చాలా తీసుకుంటున్నారట. సైరా సినిమా తో రామ్ చరణ్ కి భారీగా నష్టాలు వచ్చాయని అంటున్నారు. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఇప్పుడు రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు పారితోషికం తక్కువ తీసుకోమని కోరారట. సైరా సినిమా విషయంలో కూడా చిరంజీవి పారితోషికం ఆలోచించి తీసుకున్నారట. ఆ సినిమాకు అయన కేవల౦ రెండు కోట్లు మాత్రమే తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు మళ్ళీ తక్కువ తీసుకోమని అనడం తో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: