టాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్ నడుస్తుంది. వరుసగా సినిమాలు చేయడమే కాదు తన తండ్రి తో వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఒక నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే మూడు సినిమాలను నిర్మించాడు తన తండ్రితో. మూడో సినిమా ప్రస్తుతం లైన్ లో ఉంది. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నాలుగో సినిమా కూడా చేస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ రీమేక్ ని తెలుగులో తన తండ్రి తో కలిసి చెయ్యాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే సినిమాకు దర్శకుడిని కూడా ఎంపిక చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. 

 

ఈ సినిమాలు నిర్మిస్తునే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా మరో హీరో గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఎలా అయినా సరే విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. 

 

ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలోనే సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి తో ఆచార్య అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే కథను రెడీ చేసుకోవాలని రామ్ చరణ్ కొరటాల శివకు చెప్పినట్టు సమాచారం. ఆ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. కొరటాల కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: