టాలీవుడ్ యువ హీరోలు సూపర్స్టార్ మహేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముగ్గురు సూపర్ హిట్లతో దూసుకు పోతున్నారు. ఇక ఈ ముగ్గురు హీరోల మార్కెట్ ఇప్పుడు ఒక రేంజ్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు ఒకే డైరెక్టర్ విషయంలో పంతంతో ఉన్నట్టు తెలుస్తోంది. తమ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తో చేయాలన్నదే వీరి పంతానికి కారణమట. ఈ డైరెక్టర్ ఎవరో కాదు కొరటాల శివ. మిర్చి సినిమాతో వెండితెర ప్రస్థానం ప్రారంభించారు డైరెక్టర్ కొరటాల శివ.
ఇప్పటివరకు కొరటాల చేసిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరుతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కొరటాల చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం కొరటాలతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్చరణ్ చేసే సినిమాకు కొరటాలే దర్శకుడు అని ఓ టాక్ ఉంది. ఈ టాక్ ఇలా ఉండగనే యంగ్ టైగర్ ఎన్టీయార్, మహేష్ బాబు కూడా కొరటాలతో మళ్లీ పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్బాబుకు కొరటాల భరత్ అనే నేను, శ్రీమంతుడు లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు.
ఇక ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలు కొరటాల కోసం పోటీ పడుతుండడంతో ఫైనల్గా కొరటాల చిరు సినిమా తర్వాత ఏ హీరోతో కమిట్ అవుతాడో ? చూడాలి.