దాదాపు పదేళ్ళ నుంచి అక్కినేని వారి కోడలు సమంతా టాలీవుడ్ లో తన ప్రస్తానం కొనసాగిస్తుంది. అగ్ర హీరోలు అందరితో ఆమె దాదాపుగా సినిమాలు చేసింది. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాలు ఆపలేదు. పెళ్లి తర్వాత మంచి మంచి పాత్రలు చేసింది. భర్త ప్రోత్సాహం తో పాటుగా కుటుంబం ప్రోత్సాహం కూడా అన్ని విధాలుగా ఉన్న నేపధ్యంలో ఆమె దూకుడుగా సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల ఆమెకు జానూ సినిమా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఆ సినిమా కోసం సమంతా చాలా కష్టపడింది. 

 

వేరే సినిమాలు చేయకుండా కేవలం ఆ సినిమా మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది ఈ అమ్మాయి. అయినా సరే ఆమెకు ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం రాలేదు. దీనితో ఇప్పుడు ఆమె క్రేజ్ తగ్గింది అంటున్నారు. సమంతా గతంలో ఉన్న అంత అందంగా లేదు అని, ఆమె నటన ఉన్నా సరే గ్లామర్ పరంగా మాత్రం ఏ హీరో పక్కనా ఇప్పుడు మ్యాచ్ అవ్వడం లేదని అంటున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆమెను తీసుకోవాలని భావించారు. అయినా సరే ఆమెను ఎంపిక చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. 

 

ఇక ఇప్పుడు ఆమె చేతిలో ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి. ఆమె చేస్తే సోలో గా సినిమాలు చేయడమే గాని ఆమెకు ఇప్పుడు స్టార్ హీరోల పక్కన అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని, ఆమె క్రేజ్ తగ్గిపోయిందని, ఆమె గ్లామర్ కూడా తగ్గడంతో దర్శకులు ఆమెను వద్దని అనుకుంటున్నారు అంటూ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక కుటుంబం కూడా ఆమెను సినిమాలు మానేయమని చెప్పినట్టు సమాచారం. పిల్లల మీద దృష్టి పెట్టాలని చెప్పారట. దీనితో ఇప్పుడు ఆమె వెనక్కు తగ్గిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: