టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద సినిమాల సందడి నడుస్తుంది. సంక్రాంతికి వచ్చిన స్టైలిష్ స్టార్ నటించిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా బాక్సఫీస్ వద్ద దుమ్ము రేపింది.త్రి విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లుఅర్జున్ కెరియర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇందులో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ని ఒంటి చేత్తో ఏలుతుంది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె హవానే ఎక్కువగా నడుస్తుందని అంటున్నారు. 

 

వరుస హిట్లతో అమ్మడు ఎవ్వరికి అందని అంత దూరంలో టాలీవుడ్ లో తన నటన తో ఆకట్టుకుంటుంది. కెరియర్ ప్రారంభం లో ప్లాప్స్ చూసిన ప్రస్తుతం హిట్స్ లిస్ట్ ఫస్ట్ ఉంది. ముంబై నుంచి వచ్చిన ఈ అమ్మడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముకుంద అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ పక్కన నటిచింది. కానీ ఈ సినిమా బాక్సఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత నటించిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. అమ్మడుకి ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేశారు.

 

కానీ పూజా ఎక్కడ నిరుత్సాహపడకుండా అవకాశం వేచి చూసింది. అల్లుఅర్జున్ తో డీజే సినిమా ద్వారా ఫామ్ లోకి వచ్చింది, తర్వాత త్రివిక్రమ్ సినిమాలో చాన్సుకొట్టేసింది. ఇలా  పెద్ద హీరోలు పక్కన పూజా నే హీరోయిన్ గా ఉంటుంది. ఒకమాట లో చెప్పాలి అంటే టాలీవుడ్ లో పూజా హవా నడుస్తుంది అనే చెప్పాలి. ముందు దర్శక నిర్మాతలు ఈమె పేరు పరిశీలించిన తర్వాతే రష్మిక మందనా పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో, అఖిల్ తో రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు హిట్ అయితే పాప రేంజ్ పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: