రన్ రాజా రన్ లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేసి హిట్ కొట్టిన సుజీత్ ఆ తర్వాత సాహో చిత్రంతో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ను పెట్టి ఏకంగా రు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది.
అంత భారీ బడ్జెట్ పెట్టడంతో పాటు ప్రభాస్ టైంను ఏకంగా రెండేళ్ల పాటు వేస్ట్ చేయడంతో సుజీత్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభాస్ అభిమానులు సుజిత్ను గట్టిగా టార్గెట్ చేశారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అంత చిన్న వయస్సులో పాన్ ఇండియా సినిమా చేయడం... అదే టైంలో భారీ కాస్టింగ్ను డీల్ చేయడం మాత్రం మామూలు విషయం కాదు. అదే టైంలో సాహో బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది.
ఇప్పుడు సుజీత్ మూడో సినిమా ఏంటన్నదానిపై చర్చ నడుస్తుండగానే ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. మల్లూవుట్ హిట్ మూవీ లూసిఫర్ రైట్స్ రామ్చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ కోసం ముందుగా వివి. వినాయక్, హరీష్ శంకర్ లాంటి పేర్లు పరిశీలించిన మెగాస్టార్ ఇప్పుడు సుజీత్కు కట్టబెడితే ఎలా ఉంటుంది ? అని ఆలోచన చేస్తున్నారట.
రజనీకాంత్ సైతం మురుగదాస్ను పక్కన పెట్టేస్తే వరుసగా యువ దర్శకులకే ఛాన్సులు ఇస్తున్నారు. ఇప్పుడు చిరు సైతం సుజిత్ పాన్ ఇండియా టేకింగ్, అతడి స్టైలీష్ టేకింగ్ నచ్చి ఈ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తున్నారని అనుకుంటున్నారట. అయితే ఇది ఓ విధంగా రిస్క్ అన్న టాక్ కూడా వస్తోంది. సుజీత్ చేసినవే రెండు సినిమాలు.. టేకింగ్ బాగున్నా.. కథ, కథనాలు అంత గొప్పగా ఉండవన్న విమర్శలు ఉన్నాయి. మరి చిరు ఫైనల్ డెసిషన్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.