తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగ చైతన్య తనయుడు అక్కినేని అఖిల్ ‘మనం’ చిత్రంలో మెరుపుతీగలా కనిపించాడు. క్లయిమాక్స్ కనిపించిన అఖిల్ పై అప్పట్లో మంచి ప్రశంసలు కురిపించారు. తెలుగు తెరకు మంచి హీరో దొరికాడని.. ఇక వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగు లో వారసత్వపు హీరోలుగా వచ్చినా.. సక్సెస్ కానివారిలో అఖిల్ ఒకరు. మొదటి చిత్రం ‘అఖిల్’ లో మనోడికి మంచి పేరు వచ్చింది. డ్యాన్స్, ఫైట్స్ పరంగా అఖిల్ మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కానీ ఈ చిత్రం కూడా కమర్షియల్ హిట్ సాధించలేక పోయింది. దాంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే అఖిల్ ఎంచుకునే కథనాలు అంత బలంగా లేవని టాక్ వస్తుంది. తాజాగా ఇప్పుడు బొమ్మరిల్లుతో అద్భుతమైన విజయం అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్నాడట. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం షూటింగ్ ఇప్పుడు షరవేగంగా జరుగుతుంది. ఇందులోని ఓ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.
సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఈ చిత్రంలో అఖిల్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో అఖిల్ గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఒక ఫైట్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తు అఖిల్ చేతికి తీవ్ర గాయమైందని సమాచారం . దాంతో షూటింగ్ ను నిలిపివేశారు. అఖిల్ తిరిగి కోలుకునేంతవరకు షూటింగ్ వాయిదా వేసింది చిత్రయూనిట్. ఈ మద్య హీరోలు కొంత మంది డూప్ లేకుండా రిస్కీ షాట్స్ కూడా స్వయంగా చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.