ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, యువ హీరో సుధీర్ బాబు ల తొలి కలయికలో తెరకెక్కుతున్న సినిమా వి. పలు రకాల థ్రిల్లింగ్, కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని తొలిసారిగా నెగటివ్ పాత్రలో నటిస్తున్నారు. ఒకరకంగా ఆయన పాత్ర, సినిమాలో నెగటివ్ షేడ్స్ తో సాగినప్పటికీ, ఆ పాత్ర టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటోంది సినిమా యూనిట్. ఇటీవల మెగాస్టార్ నటించిన సైరా కు మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

 

అందాల భామలు అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మనసు మారే అనే పల్లవితో సాగె సాంగ్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 25వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మరొక పది రోజుల్లో ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తోందట సినిమా యూనిట్. కాగా ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లు నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. 

 

నిర్మాత దిల్ రాజు తో మహేష్ కు మంచి అనుబంధం ఉండడం, దానితో పాటు దర్శకుడు ఇంద్రగంటి కి మహేష్ అంటే ఎంతో అభిమానం ఉండడంతో ఆయనను ఈ సినిమాకు ప్రత్యేక అతిథిగా పిలవాలని ఫిక్స్ అయ్యారట. ఇక మరొక వారం రోజుల్లో దీనిపై యూనిట్ నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: