ట్యాలెంటెడ్  హీరో శర్వానంద్ పరాజయాల పరంపర కొనసాగుతూనే వుంది. అందులో భాగంగా పడి పడి లేచె మనసు, రణరంగంలతో డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నశర్వా కు ఇటీవలే విడుదలైన జాను కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది. కోలీవుడ్ సూపర్ హిట్ '96' కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం గత నెలలో విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. పాజిటివ్ రివ్యూస్  వచ్చిన కూడా ఈ సినిమా ను తెలుగు ప్రేక్షకు లు పట్టించుకోకపోవడంతో ప్లాపుల్లో శర్వా హ్యాట్రిక్ కొట్టాడు.
 
ఇక జాను తరువాత ఈహీరో శ్రీకారం తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నూతన దర్శకుడు  కిషోర్  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన  శర్వా ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ రాగ తాజాగా  ఈ రోజు శర్వా పుట్టిన రోజు సందర్భంగా మరో పోస్టర్ ను విడుదలచేశారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపించంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.  ఏప్రిల్ 24న ఈ సినిమా విడుదలకానుంది.  
 
ప్రస్తుతం ఈ సినిమా తోపాటు శర్వానంద్ , డ్రీం వారియర్ పిక్చర్స్  నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకార్తిక్ దర్శకుడు కాగా రీతూ వర్మ హీరోయిన్ గానటిస్తుంది. టాక్సీవాలా ఫేమ్ జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇవే కాకుండా శర్వానంద్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడని సమాచారం. చిత్రలహరి ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వా తన తదుపరి చిత్రంలో నటించనుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని టాక్ త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: