టాలీవుడ్ లో మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. టాలీవుడ్ యంగ్ హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ ఎంత మంది స్టార్ హీరోయిన్లతో నటించిన అతని కెరీర్లో కాజల్ కొంగుబంగారంగా మిగిలిపోయిందని చెప్పాలి. రామ్ చరణ్ రెండో సినిమా మగధీర తోనే అతడికి తిరుగులేని ఇమేజ్ వచ్చేసింది. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులను తిరగరాసింది. ఆ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కాజల్ మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ పండింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో 2013 సంక్రాంతికి వచ్చిన `నాయక్` సినిమా సైతం హిట్ కొట్టింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాకుర పోటీగా రిలీజ్ హిట్ కొట్టింది.

 

ఇక రామ్ చరణ్ కాజల్ కాంబినేషన్లో వచ్చిన తొలి రెండు సినిమాలు సూపర్ హిట్ అవగా వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి `ఎవడు` సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో కాజల్ నటించిన ఆమె అల్లు అర్జున్ కు జోడీగా నటించింది. సినిమా ప్రారంభంలో కొద్దిసేపు ఉండే కాజల్ పాత్ర చనిపోతుంది. 2014 సంక్రాంతికి మహేష్ బాబు `వన్ నేనొక్కడినే` సినిమాకు పోటీగా వచ్చినా `ఎవడు` సూపర్ హిట్ అయ్యింది. అలా రామ్ చరణ్ నటించిన మూడు సినిమాలలో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ మరో సినిమాలో అతిథి పాత్రలో నటించి లక్కీ హీరోయిన్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: