త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మాటల మాంత్రికుడు అని అంటారు. అయితే ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ తన సినిమా కథల విషయంలో కూడ మాయ చేస్తూ ఒకప్పటి పాత సినిమా కథను తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ తో ఇప్పటి తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా తెలివిగా మార్పులు చేసి మంచి పేరుతో పాటు సక్సస్ ను కూడ అందుకుంటున్నాడు. 


1970 ప్రాంతాలలో వచ్చిన యద్దనపూడి సులోచనా రాణి కథతో విజయనిర్మల తీసిన ‘మీనా’ మూవీకి మార్పులు చేసి ‘అ ఆ’ గా మార్చాడు. ఆతరువాత పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ మూవీ కోసం ‘లార్గో వించ్’ మూవీని అనుసరించి అనవసరమైన అపవాదులు తెచ్చుకుని త్రివిక్రమ్ పెన్ లో ఇంక్ అయిపోయిందా అన్న స్థాయిలో తన పై సెటైర్లు పడేలా చేసుకున్నాడు. 


ఇక లేటెస్ట్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ మూవీ కథ కూడ కొన్ని పాత సినిమాల కథల స్థాయిలో కనిపిస్తుంది. ఇది చాలదు అన్నట్లుగా త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ కథ తనదీ అంటూ ఒక రచయిత ఈమధ్య మీడియాలో హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ త్రివిక్రమ్ జూనియర్ తో తీయబోతున్న సినిమా కథ కోసం ఏకంగా ఒకప్పటి చిరంజీవి పాత సినిమా కథను అనుసరిస్తున్నాడు అంటూ ఇప్పుడు మొదలైన లేటెస్ట్ గాసిప్పులు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తలు ప్రకారం త్వరలో త్రివిక్రమ్ జూనియర్ తో మొదలు పెట్టే మూవీ కథ 1970-1980 ల మధ్య విడుదలైన చిరంజీవి ‘మంత్రిగారి వియ్యంకుడు’ మూవీ కథ ఛాయలలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బాపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో అల్లు రామలింగయ్య మంత్రిగా నటిస్తే అతడిని ఆట పట్టించే అల్లుడిగా చిరంజీవి నటించాడు. ఆ రోజులలో ఆ మూవీ సూపర్ హిట్. ఇప్పుడు అదే కథకు కొద్దిగా మార్పులు చేసి త్రివిక్రమ్ జూనియర్ మూవీ కథగా మార్చి ఈ మూవీలో కూడ మంత్రిగా ఉండే తన మామను ఆటాడించే అల్లుడు గా చూపించబోతున్నాడు అని టాక్. అయితే మంత్రిగారి కూతురుగా రష్మిక ను త్రివిక్రమ్ ను సూచిస్తుంటే జూనియర్ మాత్రం తనకు రష్మిక బదులు మరో క్రేజీ హీరోయిన్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: