బాహుబలి సినిమా తర్వాత అనుష్క హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంది. బాహుబలి తర్వాత ఆమె నటించిన భాగమతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం దర్శకుడు అశోక్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. భాగమతి తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. కోన ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ లో కోనవెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

ఈసినిమాలో అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా కనిపిస్తుండగా, తమిళ నటుడు మాధవన్ వయోలిన్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా మరింత లేటై వేసవిలో విడుదల కానుంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఒకపాట కూడా విడుదల అయింది.

 

ఏప్రిల్ రెండవ తేదీన విడుదలకి సిద్ధంఅవుతున్న ఈ సినిమా ప్రమోషన్లని నేటి నుంఛే స్టార్ట్ చేయనుంది. మొదటగా ఈ చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ఈ రోజు మద్యాహ్నాం ౧౨: ౧౨ కి నేచురల్ స్టార్ నానిచేత నిశ్శబ్దం చిత్ర తెలుగు ట్రైలర్ లాంచ్ చేయబడుతుంది. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అనుష్కతో పాటు పేరొందిన చాలా మంది నటులు ఉన్నారు.

 

అచ్చమైన తెలుగు హోరోయిన్ అంజలి ఎఫ్ బీ ఐ ఆఫీసరుగా కనిపించనుందని సమాచారం. అలాగే అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే సాక్షిగా కనిపిస్తుందట. మరి ఇంతమంది తారాగణం ఉన్న ఈ సినిమా ప్రేక్షకులని రంజింపజేస్తుందా లేదా అన్నది చూడాలి. ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: