సాధారణంగా సినిమా ఇండిస్ట్రీలో హీరో హీరోయిన్ల జోడీ వర్కోట్ అయితే మళ్లీ మళ్లీ అదే కాంబినేషన్లో సినిమాలు వస్తుండడం చూస్తేనే ఉంటాం. దర్శక, నిర్మాతలు కూడా అలాంటి జోడీనే ఎంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే సినీ ఇండిస్ట్రీలో హ్యాట్రిక్ సినిమాల్లో నటించిన టాలీవుడ్ జోడిలు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కాజల్ ఆగర్వాల్. వీరిద్దరూ బృందావనం, టెంపర్, బాద్షా సినిమాల్లో అద్భుతమైన కెమిస్ట్రీని పండించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరియు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో కూడా కాజల్ ఐటమ్ సాంగ్లో ఆడిపాడింది. అలాగే మహేష్ బాబు, సమంత కూడా మూడు సినిమాల్లో కలిసి నటించి హ్యాట్రిక్ కొట్టారు. దూకుడు, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎంతో చక్కగా పండింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి.. బిల్లా, బాహుబలి, మిర్చి సినిమాల్లో నటించి హ్యాట్రిక్ కొట్టారు. వాస్తవంగా చెప్పాలంటే.. తెలుగు తెరపై అదిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వాళ్ల కెమిస్ట్రీ, బయట వాళ్లిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే.
ప్రభాస్, అనుష్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ... వారిపై నిజజీవితంలో కూడా పలు రూమర్లు పుట్టేలా చేసింది. అలాగే ఎన్టీఆర్, సమంత హ్యాట్రిక్ కొట్టడం కాదు.. ఏకంగా నాలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మెప్పించారు. బృందావనం, రభస, జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్య సినిమాల్లో నటించారు. ఇక బాలకృష్ణ, నయనతార కూడా మూడు సినిమాల్లో నటించి హ్యాట్రిక్ కొట్టారు. సింహా, జైసింహా, శ్రీరామరాజ్యం సినిమాల్లో బాలయ్య, నయన్ పండించిన కెమిస్ట్రీ అద్భుతంగా వర్కోట్ అయింది. ఈ సినిమాలకు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఓ ప్లస్గా మారింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.