గత ఏడాది మజిలీ,వెంకిమామ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫామ్ లోకి వచ్చిన యువ సామ్రాట్  నాగ  చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరిలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో ఈ కాంబినేషన్ పై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అందుకు తగ్గట్లు గానే జరుగుతుంది. ఇక ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం గా పూర్తి కానుండడం తో మే 29న  విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
 
యూత్ ఫుల్ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఛైతన్య ,సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నారు.  పవన్  సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ ,అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తరువాత నాగ చైతన్య, గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ డైరెక్షన్ లో తన 20 వ చిత్రం లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ చిత్రం మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట ,గోపిచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. 
 
ఇక ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి, లవ్ స్టోరి తోపాటు వేణు ఊడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుంది. రానా హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుందట. జులై లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సినిమాతోపాటు సాయి పల్లవి తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: