సిద్ శ్రీరాం... ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సింగర్. అతని వాయిస్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతను పాడే కొన్ని మెలోడి పాటలకు అయితే కుర్ర కారు ఊగిపోతుంది. ఏ పాటను అయినా సరే యూత్ కి నచ్చే విధంగా పాడటం అతని స్టైల్. గీత గోవిందం సినిమాలో అతను పాడిన కొన్ని పాటలు ఇప్పటికి అభిమానులు వింటూనే ఉన్నారు. అతను పాట పాడితే ఆ సినిమా హిట్ అనే అభిప్రాయం కూడా టాలీవుడ్ జనాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా అగ్ర హీరోలు ఇప్పుడు అతని పాటల కోసం ఎదురు చూసే పరిస్థితి.

 

అతను పాడిన గీత గోవిందం, అల వైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ సినిమాల్లో పాటలు కూడా యూత్ ని బాగానే ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో అతను పాడిన సామజవరగమనా పాట ఇప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. యుట్యూబ్ లో కూడా కోట్ల వ్యూస్ సాధించింది ఆ పాట. ఆ విధంగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో ముందు ఈ పాటనే విడుదల చేసారు. 

 

ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ సినిమాలో మగువా మగువా అనే పాటను కూడా విడుదల చేసారు. ఈ పాట కూడా అతను పాడిందే కావడం విశేషం. దీనితో అతను లక్కీ సింగర్ అయ్యాడని అంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కి అతను బాగా కనెక్ట్ అయ్యాడు అనేది జనాల మాట. గీత గోవిందం సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. ఇక అల్లు అర్జున్ తో వచ్చిన అలవైకుంఠపురములో, అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమానే. మరి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: