చిత్రపరిశ్రమలో పరిస్దితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు.. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన వారు సడెన్‌గా డౌన్ అవుతారు.. అప్పటి వరకు ఏదో ఒక మూల ఉండి నటించేవారు అనుకోకుండా వెండి తెరమీద వెలిగిపోతారు.. స్టార్ హోదా అనేది ఒక పరుగుపందెం లాంటిది.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలి. దీనికి తోడు హిట్స్ పడుతూనే ఉండాలి.. లేదంటే ప్రేక్షకులతో పాటు దర్శకులు కూడా మరచిపోయే అవకాశం ఉంది..

 

 

ఇకపోతే మగధీరా చిత్రంతో ఊహించనంత రేంజ్‌కు వెళ్లిన కాజల్ అగర్వాల్.. లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించగా, కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు.. ఆ తర్వాత చందమామ చిత్రంతో జాబిలమ్మలా వెలిగిపోయింది.. కాని మగధీరా చిత్రం.. కాజల్ అగర్వాల్‌కు చిత్రపరిశ్రమలో చెదరని స్దానాన్ని అందించిందని చెప్పవచ్చూ.. అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోలేదు..

 

 

అయితే తేజ పరిచయం చేసిన ఆ అందాల బొమ్మ, తేజ దర్శకత్వంలో ఇదివరకే మూడు సినిమాలు చేసిందన్న విషయం తెలిసిందే.. కాగా తాజాగా గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోవాలనుకున్న దర్శకుడు తేజకు షాక్ తప్పలేదట.. నాలుగోసారి కూడా కాజల్‌నే తన సినిమాలో తీసుకోవాలని అనుకున్న తేజకు ఈమె చెప్పిన రేట్‌ విని దిమ్మతిరిగి పోయిందట..

 

 

అదేమంటే తన తొలిచిత్ర దర్శకుడు అయిన తేజ, గోపీచంద్‌తో తీసే చిత్రంలో నటించమని అడిగితే ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఆమె రేటు విన్న ఈ దర్శకుడు ఔట్ డేటెడ్ హీరోయిన్‌కు అంత ఇవ్వడం ఎందుకు.. ఫామ్‌లో ఉన్న ముద్దుగుమ్మను అంతకంటే తక్కువకే తీసుకొద్దాంలే అని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది... ఏది ఏమైనా ఇప్పుడు అంతగా అవకాశాలు లేని కాజల్ మరీ ఇంత కొండెక్కి కూర్చోవాలా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: