ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఏదైనా సరే మొత్తం డిజిటల్ ఫ్లాట్ఫాం మీద ఎక్కువగా ఆశక్తి చూపుతున్నారు. పెద్ద పెద్ద నటీనటులందరూ అందులో నటించడానికి ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. అలాగే పెద్ద పెద్ద నిర్మాతలు కూడా దాని పై మగ్గు చూపుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ప్రారంభించిన `ఆహా`కు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. అందుకు ప్రధాన కారణం కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే అని తెలుస్తోంది. అయితే దీని పై ఎంతో సీరియస్గా తీసుకున్న అల్ల అరవింద్ వెరైటీ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ని అందించాలని ఆయన కోరికట. దాంతో ముగ్గురు క్రేజీ దర్శకుల్ని రంగంలోకి దింపేస్తున్నారట. ఇప్పటికే వారితో ఓ భారీ ఒప్పందం కూడా చేసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురు క్రేజీ డైరెక్టర్లు మరెవరో కాదు సుకుమార్, వేణు ఊడుగుల, సుధీర్ వర్మ. ఈ ముగ్గురూ త్వరలో `ఆహా` కోసం వెబ్ సిరీస్లు చేయబోతున్నారని సమాచారం. సినిమాతో పోలిస్తే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ వుండవు. తాము చెప్పాలనుకున్నది సూటిగా చెప్పవచ్చు. చూపించాలనుకున్నది నిరభ్యతరంగా చెప్పొచ్చు దీంతో చాలా మంది నిర్మాతలు, దర్శకులు అలాగే నటీనటులు కూడా ఇంత ఇంట్రస్ట్ చూపించడానికి కారణం ఇదే. ఇక అదే ఈ దర్శకులని ఇటు వైపు అడుగులు వేసేలా చేసిందట. ఈ ముగ్గురిలో సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో ఓ భారీ చిత్రాన్నిచేస్తున్నారు. అది పూర్తయిన తరువాతే ఆయన ఫ్రీ అవుతారు. ఇక సూకుమార్ డైలాగులు, పంచల గురించి మనకు తెలిసిందే. వేణు ఊడుగుల పరిస్థితి అంతే రానా, సాయిపల్లవితో `విరాటపర్వం` తెరకెక్కిస్తున్నారు. సుధీర్ వర్మ కూడా సైలెంట్గా ఓ సినిమా చేస్తున్నారు. ముగ్గురి ప్రాజెక్ట్లు పూర్తయిన తరువాత వెబ్ సిరీస్ల బాట పడతారట.
అయితే దీనికి ముందు వేణుఊడిగల `విరాటపర్వం` చిత్రం కాస్త బ్రేక్ వచ్చిన సమయంలో అంటే రానా కిడ్నీ ప్రాబ్లమ్తో కొంత రెస్ట్లో ఉన్న సమయంలో... వెబ్సిరీస్ చేస్తానని అల్లుఅరవింద్ వద్దకు వచ్చారు. దాంతో ఆయన సరేనని అనగా రానా అతి తక్కువ గ్యాప్లోనే మళ్ళీ ఆయన తిరిగి రావడంతో వేణు సినిమా బిజీలో పడిపోయారట. లేదంటే ఈ పాటికి ఓ మంచి వెబ్సిరీస్ రెడీ అయిపోయేది. దీంతో అరవింద్కి కోపమొచ్చి ఆదర్శకుడ్ని కాస్త మందలించినటలు వార్తలు కూడా వచ్చాయి.