యంగ్ హీరో శర్వానంద్, నూతన దర్శకుడు  కిషోర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం శ్రీకారం. ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదలకావాల్సి వుంది అయితే తాజాగా మేకర్స్ విడుదల ను వాయిదా వేశారని సమాచారం. దానికి గల కారణాలు తెలియదు కానీ  శ్రీకారం సమ్మర్ బరిలో నుండి తప్పుకుందని తెలుస్తుంది. జులై లో ఈ సినిమా ను విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. నిన్న శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఈచిత్రం నుండి విడుదలైన పోస్టర్ల పై కూడా విడుదలతేది ని ప్రకటించలేదు. రామ్ ఆచంట ,గోపించంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
 
ఇక ఈ సినిమా తో పాటు శర్వా ప్రస్తుతం శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇవే కాకుండా శర్వానంద్ తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిత్రలహరి ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వా తన తదుపరి చిత్రంలో నటించనున్నాడు. పడి పడి లేచె మనసు నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నాడు. 
 
ఇదిలావుంటే వరుస డిజాస్టర్ల తో శర్వానంద్ రేస్ లో బాగా వెనుకబడిపోయాడు. పడి పడి లేచె మనసు తరువాత గత ఏడాది రణరంగం షాక్ ఇవ్వగా ఇటీవల జాను కూడా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది. దాంతో  శ్రీకారం పై భారీ ఆశలు పెట్టుకున్నడు శర్వానంద్. మరి ఈ సినిమా తో నైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: