‘అలా మొదలైంది’ మూవీతో మహిళా దర్శకురాలిగా పరిచియం అయిన నందిని రెడ్డి లేటెస్ట్ గా తీసిన ‘ఓ బేబి’ సూపర్ సక్సస్స్ అయినా ఆమెకు చెప్పుకో దగ్గ అవకాశాలు రావడంలేదు. దీనితో ఆమె వద్ద చాల కధలు ఉన్న నటించే హీరోలు దొరకకపోవడంతో ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే స్థితిలో లేదు.  


ఇలాంటి పరిస్థితులలో ఆమె రెండు నెలల క్రితం మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కు ఒక కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి వైష్ణవ్  తేజ్ కి ఆమె చెప్పిన కథ నచ్చినా ప్రస్తుతం అతడి సినిమాలకు సంబంధించి కధలు వింటున్న చిరంజీవికి ఆ కథ నచ్చలేదని టాక్.  


దీనితో చిరంజీవి ఆమెను ఈ కథకు సంబంధించి మార్పులు చేసి మళ్ళీ తీసుకురమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఈ కథకు సంబంధించి ఎన్ని మార్పులు చేసినా అది ఓకె కాకపోవడంతో ఆ కథతో నాగచైతన్య తో మూవీ తీయాలని నందిని రెడ్డి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది. స్వతహాగా మొహమాటం ఎక్కువగా ఉండే నాగచైతన్య నందినీ రెడ్డి కథకు ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ విషయాలు సమంత దృష్టి వరకు రావడంతో నందినీ రెడ్డి కథను తాను విన్న తరువాత మాత్రమే చైతన్య ను తన నిర్ణయం తెలియచేయమని అప్పటి వరకు ఈ విషయాన్ని పెండింగ్ లో పెట్టమని సమంత చైతన్యకు సూచించింది అని అంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ను మాస్ హీరోగా తీర్చిదిద్దాలని సమంత ఆతరహా కథల కోసం అన్వేషణ కొనసాగిస్తున్న పరిస్థితులలో నందినీ రెడ్డి చెప్పే సాఫ్ట్ స్టోరీ ఎంత వరకు సమంత కు నచ్చుతుంది అన్నది సస్పెన్స్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాబోలు నందిని రెడ్డి అవకాశం చిక్కినప్పుడల్లా సమంత ను ఆకాశానికి ఎత్తేస్తూ అనేక కామెంట్స్ చేస్తోంది అని అంటున్నారు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: