హాలీవుడ్‌ మోడల్‌, నటి క్రిస్నీ టీజెన్‌ మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఇటీవల తన వక్షోజాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పిన ఈ భామ, తాజాగా మరో సంచలన విషయాన్ని చెప్పింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిమానులకు తన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయన చెప్పింది. మార్చి 4న తన సోషల్ మీడియా పేజ్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. ఈ భయానక సంఘటన కారణంగా క్రిస్సీ తన బెడ్ రూమ్‌లో పడుకోలేకపోతుందట.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. `ఇవన్నీ మీకు వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయన్న భావన నన్ను వెంటాడుతోంది. రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తున్నారు. ఈ భయం కారణంగా నేను రోజు చాలా ఎర్లీగా నిద్రపోతున్నా.. చాలా ఆలస్యంగా మేల్కొంటున్నా. భయంకరమైనకలల కారణంగా నిద్ర సరిగా పోలేకపోతున్నా. అంతేకాదు నాకు ప్రతీసారి ఒకే కల వస్తుంది` అంటూ కామెంట్‌ చేసింది.

 

అయితే తనకు వస్తున్న కల ఏంటి అన్న విషయాన్ని మాత్రం క్రిస్సీ చెప్పలేదు. ` ఇంట్లో మరో రూం ఉండటం నిజంగా అదృష్టం. నాకు శక్తి కావాలి. నేను ప్రశాంతంగా ఉండాలి. ఇలా భయపడుతూ నేను బతకలేను. నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఈ కలలు నాకు పిచ్చెక్కిస్తున్నాయి. నేను దీనిని నుంచి బయట పడాలి. అందుకే ఇక నుంచి మరో రూంలో పడుకుంటాను` అంటూ పోస్ట్ చేసింది క్రిస్సీ. అయితే మరో రూంలో పడుకున్న తరువాత తనకు కలలు రాలేదని ప్రశాంతంగా పడుకున్నానని చెప్పింది. ఎన్నో నెలలగా తను పడుతున్న ఇబ్బంది నుంచి బయట పడ్డానని చెప్పింది క్రిస్సీ

మరింత సమాచారం తెలుసుకోండి: