హాలీవుడ్ మోడల్, నటి క్రిస్నీ టీజెన్ మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఇటీవల తన వక్షోజాలతో ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పిన ఈ భామ, తాజాగా మరో సంచలన విషయాన్ని చెప్పింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు తన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయన చెప్పింది. మార్చి 4న తన సోషల్ మీడియా పేజ్లో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. ఈ భయానక సంఘటన కారణంగా క్రిస్సీ తన బెడ్ రూమ్లో పడుకోలేకపోతుందట.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. `ఇవన్నీ మీకు వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయన్న భావన నన్ను వెంటాడుతోంది. రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తున్నారు. ఈ భయం కారణంగా నేను రోజు చాలా ఎర్లీగా నిద్రపోతున్నా.. చాలా ఆలస్యంగా మేల్కొంటున్నా. భయంకరమైనకలల కారణంగా నిద్ర సరిగా పోలేకపోతున్నా. అంతేకాదు నాకు ప్రతీసారి ఒకే కల వస్తుంది` అంటూ కామెంట్ చేసింది.
అయితే తనకు వస్తున్న కల ఏంటి అన్న విషయాన్ని మాత్రం క్రిస్సీ చెప్పలేదు. ` ఇంట్లో మరో రూం ఉండటం నిజంగా అదృష్టం. నాకు శక్తి కావాలి. నేను ప్రశాంతంగా ఉండాలి. ఇలా భయపడుతూ నేను బతకలేను. నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఈ కలలు నాకు పిచ్చెక్కిస్తున్నాయి. నేను దీనిని నుంచి బయట పడాలి. అందుకే ఇక నుంచి మరో రూంలో పడుకుంటాను` అంటూ పోస్ట్ చేసింది క్రిస్సీ. అయితే మరో రూంలో పడుకున్న తరువాత తనకు కలలు రాలేదని ప్రశాంతంగా పడుకున్నానని చెప్పింది. ఎన్నో నెలలగా తను పడుతున్న ఇబ్బంది నుంచి బయట పడ్డానని చెప్పింది క్రిస్సీ
I’ve been having the same nightmare for months. If I wake up, i fall right back into it when I go back to sleep. And when I do officially wake up, I’m soaking wet and so sad all day. I’m tired!! Sleeping in a different room tonight pic.twitter.com/QUaYLtB65D
— christine teigen (@chrissyteigen) March 5, 2020