ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్‌ కారణంగా వణికిపోతుంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3000 మందికి పైగా ప్రజలు మరణించారు. మన దేశంలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు కావటంతో ప్రజలలో భయాందోళలను నెలకొన్నాయి. సెలబ్రిటీల్లోనూ ఈ భయం కనిపిస్తోంది. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కరోనా భయంతో కేక్‌ తినేందుకు నో చెప్పటం వార్తల్లో నిలిచింది.

 

దడక్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ ఇటీవల 23వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన సన్నిహితులతో పాటు కొంత మంది మీడియా వారితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అందరి ముందు కేక్‌ కట్‌ చేసిన జాన్వీ ఓ ఫోటోగ్రాఫర్ కేక్‌ తినిపించబోతే సున్నితంగా తిరస్కరించింది.

 

జాన్వీ కేక్‌ కట్‌ చేసిన తరువా తో మహిళా ఫోటోగ్రాఫర్‌ దగ్గరకు వచ్చి కేక్ తినిపించేందుక ప్రయత్నించింది. కానీ జాన్వీ  ఆ కేక్‌ను నోటి దగ్గరకు తీసుకుంది కానీ తినలేదు. దీంతో కరోనా భయంతోనే జాన్వీ కేక్‌ తినేందుకు నిరాకరించిందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో హాఫ్ వైట్‌ డ్రెస్‌లో అందంగా ముస్తాబయి కనిపించింది జాన్వీ.

 

ఇక సినిమాల విషయానికి వస్తే దడక్‌ సినిమా తరువాత ఇండియన్‌ స్క్రీన్ మీద తళుక్కుమన్న ఈ బ్యూటీ ప్రస్తుతం కార్గిల్ వార్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్‌ మూవీ గుంజన్ సక్సెనాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రూహీ అఫ్జా, తక్త్‌ సినిమాల్లో నటిస్తోంది జాన్వీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#JanhviKapoor cuts cake with paps today #happybirthday #instadaily #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

మరింత సమాచారం తెలుసుకోండి: