తెలుగు ఇండస్ట్రీలోకి కూలీ నెం.1 చిత్రంతో వెంకటేష్ సరసన నటించిన హైదరాబాద్ బ్యూటీ టబు ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగు లో వరుసగా అవకాశాలు వచ్చాయి. నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా తో మంచి విజయం అందుకున్న టబు అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ కి జంప్ అయ్యింది.  అక్కడే స్థిరపడ్డ టబు పలు హిట్ చిత్రాల్లో నటించింది.  కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టబు ఈ మద్య రీ ఎంట్రీ ఇచ్చింది.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటీమణులకు కాస్త రెమ్యూనరేషన్ విషయంలో సడలింపు ఉంటుంది. కానీ ఇప్పుడు ఫెడవుట్ హీరోయిన్ అయినప్పటికీ టబు డిమాండ్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది. 

 

ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ మనసు దోచిన స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ‘ప్రేమదేశం’ లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో టబు కి ఉన్న క్రేజ్ ఇప్పుడు అంతా ఇంతా కాదు.  ప్రస్తుతం టబు టైమ్ లో నటించిన హీరోయిన్లు అందరూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య నదియా మెరుపులా మెరిసి తర్వాత కనుమరుగైంది.  ఇటీవల  తెలుగులో ఆమె 'అల వైకుంఠపురములో' చిత్రం చేసింది. ఈ చిత్రంలో జయరామ్ భార్య పాత్రలో ఆమె కనిపించింది.

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ  తరహా పాత్రల్లో టబు కి మంచి క్రేజ్ ఉన్నట్లు అర్థమైంది.  శ్రీమంతురాలి పాత్రలకిగాను ముందుగా 'టబు' పేరునే దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట. అప్పట్లో ఈ తరహా పాత్రల్లో నదియాను తీసుకునేవారు.. కానీ ఆమె స్థానంలో టబు చేర్చుకుంటున్నారు. ఈ తరహా పాత్రలకి ఆమె అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పారితోషికంగా ఆమె కోటి రూపాయలు అడుగుతోందట. అంతే క్రేజ్ ఉన్నపుడే యూజ్ చేసుకోవాలని టబు కి బాగా అర్థమైనట్లుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: