ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్ర ని పోషిస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ ఇంకా కొంతమంది ప్రముఖ బాలీవుడ్ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ దేశవ్యాప్తంగా తారా స్థాయికి చేరుకుంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే వాటన్నిటినీ పట్టించుకోకుండా రామ్ చరణ్ తేజ్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం తన తండ్రి అయిన మెగాస్టార్ చిరంజీవిని తీవ్ర షాక్ కి గురిచేస్తుంది. 

 

IHG

 

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు నాలుగైదు నెలలు పడుతుంది. అయితే ఆ సినిమా పూర్తి చేసుకోగానే వెంటనే మరో సినిమా తీసే యోచనలో రామ్ చరణ్ తేజ్ ఉన్నాడని ఇటీవల కాలంలో సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. కానీ రామ్ చరణ్ తేజ మాత్రం మంచి కథాబలం ఉన్న స్క్రిప్ట్ ల కోసం వెతుకుతున్నాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో సరికొత్త కథలను దర్శకులు వినిపించినా అవి నచ్చలేదని చెప్పి పంపించి వేసాడట రామ్ చరణ్.

 

IHG


ఐతే తాజాగా ప్రదీప్ అనే ఒక కొత్త దర్శకుడు వినిపించిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పేశాడట. రాంచరణ్ సినీ కెరీర్ చూసుకుంటే... అతను ఇప్పటివరకు ఏ కొత్త డైరెక్టర్ తో కలిసి సినిమా తీయలేదు. కానీ దర్శకుడు ప్రదీప్ తో మూవీ తీసేందుకు వెంటనే అంగీకరించాడు. ఐతే రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చిందట. అందుకే అతను వెంటనే ప్రదీప్ చేత కథని చెప్పించుకున్నాడట. అలాగే, కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించాడట. ఆర్ఆర్ఆర్ సినిమా తో తన స్టార్డమ్ ని పెంచుకోబోతున్న చెర్రీ కొత్త దర్శకుడితో సినిమా తీసేందుకు సిద్ధమవడం అనేది చాలా పెద్ద సాహసమనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ తరువాత ప్రదీప్, చెర్రీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆసక్తికర అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: